Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండరెంజల్లో రైతుల రాస్తారోకో
- రాస్తారోకో చేస్తున్న రైతులు
నవతెలంగాణ-బిచ్కుంద
వారి ధాన్యం కొనుగోలు చేయాలంటూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బండరెంజల్ రైతులు శనివారం రాస్తారోకో చేపట్టారు. పంట ఆలస్యంగా వచ్చిందనీ, ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవరిస్తూ తమను ఇబ్బందులు పెడుతున్నా రన్నారు. తమ పొలాల్లోని ధాన్యానికి 'బీ' గ్రేడ్ ధర కల్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ నరేందర్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఐకేపీ ఏపీఎం నాగరాజు, తహసీల్దార్ గోవర్ధన్ వచ్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో రైతులు రాస్తారోకో విరమించారు.