Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్షరంతోనే సమాజ మార్పు :
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యుద్ధాల కంటే విజ్ఞానమే ఎక్కువ స్వేచ్ఛను అందిస్తుం దని, అక్షరంతోనే సమాజ మార్పు సాధ్యమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. పుస్తకాలను చదవ టం అలవాటు చేసుకుంటే జీవన ప్రమాణాలు పెరుగుతా యన్నారు. ఈ సందర్భంగా ''అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక''అన్న కాళోజీ మాటల్ని గుర్తు చేశారు. నేడు గ్రంథాయాలకు వెళ్లే వారి సంఖ్య గణనీ యంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంథాల య ఉద్యమానికి మళ్లీ రెక్కలు తొడగాలని ఆకాంక్షించారు. స్వతహాగా తెలుగు భాషాభిమాని, రచయిత అయిన కె.చం ద్రశేఖర రావు ముఖ్యమంత్రి కావడం, తెలంగాణలో గ్రంథా లయాల ప్రాధాన్యత మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఊరుకో గ్రంథాలయం...ఇంటికో స్వచ్ఛాల యం (మరుగుదొడ్డి) ఉండేలా చూసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హెదరాబాద్లోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్స్టేడియం)లో కపిలవాయి లింగమూర్తి ప్రాంగణం లోని సంగం లక్ష్మీబాయి వేదికగా 32వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను ఉపరాష్ట్రపత్తి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభిం చారు. నేషనల్ బుక్ ట్రస్ట్ 1966లో ముంబైలో తొలి ప్రదర్శన నిర్వహించారని, నాటి నుంచి పుస్తక మహోత్సవా లకు మంచి ఆదరణ లభిస్తున్నదని అన్నారు. ప్రస్తుతం హైద రాబాద్ పుస్తక మహౌత్సవం దేశంలో రెండో స్థానంలో ఉం దని, మొదటి స్థానంలో ఉన్న బెంగాల్ను ఆదర్శంగా తీసుకు ని తెలంగాణ ప్రభుత్వం కూడా పుస్తకాల కొనుగోళ్ళు జరిపి, మొదటి స్థానానికి చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రచురించబడుతున్న పుస్తకాల సంఖ్య పెరుగుతున్న నేప థ్యంలో నాణ్యమైన పుస్తకాలు ఎన్ని అచ్చువేస్తున్నారనే విష యం తెలియాల్సి ఉందని, పుస్తకాలు కేవలం కాలక్షేపం కోసం కాదని, అవి ప్రజలను మేల్కొలిపే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. అక్షరం అంటే నాశనం లేనిదని అర్థమ న్నారు. ఓ సందర్భంలో డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు అక్షరం గురించి చెబుతూ... అది అక్షరం. అదే చిగురిస్తే శబ్దమౌతుంది. అక్షరమనే తీగ సాగితే వాక్యమవుతుంది. పందిరంత విస్తరిస్తే గ్రంథమౌతుంది అన్న మాటలను గుర్తుచేశారు. విద్యార్థుల్లో, పాఠకుల్లో పఠనాసక్తిని పెంచి, వారి విజ్ఞాన వికాసాలకు తోడ్పడాలనే హైదరాబాద్ పుస్తక మహోత్సవ వారి ఆశయం, లక్ష్యం సత్ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సినిమాలెన్ని వచ్చి పడినా, ఇంట్లోకి టీవీ ఎంత చొచ్చుకుపోయినా పుస్తకాలు లేని ప్రపంచాన్ని ఊహించలేమన్నారు. తెలుగు తొలి ప్రచురణ 'నూరు జ్ఞాన వచనాలు' జర్మన్ దేశంలో హాతి గ్రామంలో బెంజిమిమ్ షుల్ట్ అనే క్రైస్తవ మతాధికారి ప్రచురించారని తెలిపారు. పుస్తకాలు ఓ మతానికో, ఓ కులానికో, ఓ వర్గానికో పరిమి తం కావన్నారు. ఈ పుస్తక మహౌత్సవాలు భాష, భావాల అభివృద్ధికి, సమాజాభివృద్ధికి, చైతన్యానికి దోహదం చేస్తాయన్నారు. ప్రపంచీకరణ తర్వాత ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత తగ్గి, ప్రాంతీయ భాషల్లో పుస్తకాలు, పత్రికలను చదివేవారి సంఖ్య తగ్గుతూ వస్తుందనడంలో సందేహం లేదన్నారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో పాఠకుల సంఖ్య పెరుగుతోందని నీల్సన్ సర్వేలో తేలడం సంతోషకరమన్నారు. దాశరథి గారు చెప్పినట్టుగా విప్లవ మంటే మృత్యువు విలయ తాండవ కాదు, పీనుగుల గుట్టల నుంచి విప్లవాలు రావు ప్రజలను మేల్కొలపాలి నిజమేదో తెలపాలి హృదయాల్లో విప్లవాలు ఎదగాలి... అలాంటిశక్తి ఉన్న పుస్తకాలు ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆకాం క్షిస్తున్నట్టు చెప్పారు.
ఇంటర్నెట్, టీవీ సంస్కృతి పఠనాసక్తి తగ్గుతున్న క్రమంలో పాఠకుల్ని తయారు చేసుకోవలసిన అవసరం ప్రచురణ రంగానికే గాక, పత్రికా రంగానికి కూడా ఉందన్నారు. నేడు మీడియా రంగం సెన్సేషనిజానికి పెద్ద పీట వేస్తోందన్నారు. ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య, జ్యోతిబసు, వాజ్పేయి, జైపాల్రెడ్డి, దీప్దాస్గుప్తా, తదితర నేతలు విస్తృతంగా అధ్యయనం చేసి చట్టసభల్లో చర్చిం చేవారని, శాసనసభ, లోక్సభల్లోని గ్రంథాలయాలను చక్క గా ఉపయోగించుకునేవారని చెప్పారు. నేడు పరిస్థితి మా రిందని సమస్యల మీద చర్చకంటే పోడియం ముందు బైటా యించడం, మైకులు విరగ్గొటం, కుర్చీలు విసురుకోవడం వంటి చేష్టలను చట్టసభల్లో చూడాల్సి వస్తోందని, మీడియా కూడా వాటికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ఆ ధోరణిని విడనాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల్లోని సామాజిక చైతన్యాన్ని ద్విగుణీకృతం చేసిన ఘనత గ్రంథాలయ ఉద్యమానికి దక్కుతుందని, అంతేగాకుండా తెలుగు భాష సాంస్కృతిక, సారస్వత పునరుజ్జీవనానికి మార్గాన్ని సుగమం చేసిందని వివరించారు. గ్రంథ పఠనాన్ని విసత్తృం చేసేందుకు ప్రభుత్వంతో పాటు ప్రయివేటు సంస్థలు కూడా ముందుకు రావాలని కోరారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు.
హైదరాబాద్, విజయవాడ బుక్ఫెయిర్లు పుస్తక ప్రియుల మన్ననలు పొందాలని, విజయం సాధించాల న్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు పెద్ద పెద్ద వస్తువుల బదులు పుస్తకాలను బహుమతులుగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. 'అజ్ఞాన తిమిరాలను తరిమేద్దాం..విజ్ఞాన దీపాలను వెలిగిద్దాం. జై హింద్' అంటూ తన ప్రసంగాన్ని వెంకయ్యనాయుడు ముగించారు. హైదరాబాద్ బుక్ఫెయిర్ ట్రస్ట్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షత వహించిన ఈ సభలో టీఎస్పీఎస్సీ చైర్మెన్ ఘంటాచక్రపాణి, తెలంగాణ భాషా, సాంస్కృతిక మండలి డైరెక్టర్ బుర్రా వెంకటేశం, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, విజయవాడ బుక్ఫెయిర్ అధ్యక్షులు విజరుకుమార్, హైదరాబాద్ బుక్ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్, కోశాధికారి రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.