Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్
- పనుల్లో జాప్యం అలసత్వం తగదని ఆదేశం
- సీతారామ ఎస్సారెస్పీ పనుల్లో
- జాప్యంపై ఆగ్రహం
- మంగళవారం నుంచి రెండ్రోజులు
- ప్రాజెక్టుల సందర్శనకు నిర్ణయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని రెండేండ్లలో పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతి భవన్లో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏడు గంటల సేపు ఈ సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల పనుల్లో అలసత్వం, జాప్యం లేకుండా యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సీతారామ, శ్రీరామ సాగర్ పునరుజ్జీవం పథకం పనులు మందకొడిగా నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఏజెన్సీలు, సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరం పనులు పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని, ఇందుకోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరిశీలించేందుకు రెండ్రోజుల పాటు నిర్మాణ ప్రాంతాలను సందర్శించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజిలను, పంప్మౌజ్లను సీఎం మంగళవారం సందర్శిస్తారు. అనంతరం మరుసటి రోజు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల కింద భూ నిర్వాసితులకు చెల్లించడానికి రూ.80 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కువ భూమికి నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెరచాలని, వచ్చే జూన్, జూలై నాటికి నీరందించా లని దిశా నిర్దేశం చేశారు. మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు, పంప్హౌస్ల నిర్మాణాల్లో వేగం పెరగాలన్నారు. కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. సింగూరుకు రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించి నారాయణఖేడ్ నియోజకవర్గానికి లక్ష, జహీరాబాద్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరందరించాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సిఎం కోరారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులపై త్వరలోనే మరోసారి విస్త త స్థాయిలో సమీక్ష నిర్వహించాలని సిఎం నిర్ణయించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక ష్ణ రావు, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు.