Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమాజంలో ప్రతిఒక్కరు జీవ వైవిద్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ జస్టీస్ ఎల్.నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే జీవ వైవిద్య చట్టం - 2002ను హైదరాబాద్లోని కేశవ మెమోరియల్ లా కళాశాలలోని సర్దార్ పటేల్ ఆడిటోరియంలో మంగళవారం ఆయన ప్రారంభించారు. జీవులు, వృక్షాలు వాటి పరిణామ క్రమం.. ఆహారం, కూరగాయలు వాటి సూక్ష్మ విశ్లేషణల విధానాలను ఈ సందర్భంగా నర్సింహ్మారెడ్డి వివరించారు. జీవవైవిద్య పరిరక్షణ ప్రాముఖ్య గురించి చెప్పారు. బయోడైవర్సిటీ చట్టాలపై మేథోసంపత్తి హక్కులు వాటి వల్ల వచ్చే ఉపయోగాలపై తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ జీవ వైవిద్య చట్టపరమైన సంరక్షణ వాటి పరిమితుల అవగాహన గురించి తెలిపారు. ఆ చట్టాలు అమలు చేసే విధానాలు సరళీకృతమైన ప్రక్రియ ద్వారా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ జి.సాయిలు, కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి శ్రీధర్రెడ్డి, కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్ డాక్టర్ కుసుమ కుమారి, కరెస్పాండెంట్ ఎల్.ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.