Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారులను వ్యభిచార ఊబిలోకి నెట్టిన వ్యవహారంపై : హైకోర్టు
హైదరాబాద్: యాదగిరిగుట్టలో చిన్న పిల్లలను వ్యభిచార ఊబిలోకి నెట్టిన వ్యవహారంపై సత్వర విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి ఎస్వీ భట్లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ప్రకటించింది. పిల్లలతో వ్యభిచారం చేయిస్తున్న ఆరోపణల కేసును ఎప్పటిలోగా ప్రత్యేక దర్యాప్తు బ ందం (సిట్) దర్యాప్తు పూర్తి చేస్తుందో వెల్లడించాలని తెలంగాణ సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేకంగా బాలల స్నేహపూర్వక కోర్టును ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. పిల్లల్లి వారి తల్లిదండ్రులు కలుసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదని న్యాయవాది చెప్పారు. వెంటనే ప్రభుత్వం కల్పించుకుని వారిలో ఎవరూ తల్లిదండ్రులు కాదని, పెంచినవారని చెప్పింది. ఈ వ్యవహారంపై తర్వాత విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
కార్పొరేట్ కళాశాలకు నోటీసులు
నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై తమ వాదనలతో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తోపాటు రెండు విద్యా సంస్థలకు హైకోర్టు నోటీసు లు ఇచ్చింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సాంకేతిక విద్య/ఇంటర్మీడియట్ విద్య కమిషనర్లకు ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి ఎస్వీ భట్లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం నోటీసులిచ్చింది. రెండు విద్యా సంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ మేడ్చల్ నుంచి వినోద్రెడ్డి ఇతరులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని బెంచ్ విచారించింది. గతంలో ఇదే తరహాలో దాఖలైన వ్యాజ్యాలతో కలిసి ఈ పిల్ను విచారిస్తామని బెంచ్ ప్రకటించింది. ఏపీలోని ఆ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే వాటిపై విడిగా కేసు దాఖలు చేసుకోవచ్చునని బెంచ్ సూచన చేసింది. విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.