Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీసీ సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను యదావిధిగా కొనసాగించాలని ఎంబీసీ సంఘం డిమాండ్ చేసింది. అదేవిధంగా రిజర్వేషన్లను ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34 శాతం అమల్లో ఉన్నా వర్గీకరణ లేకపోవడం వల్ల 112 బీసీ కులాల్లో కేవలం ఆరేడు కులాలు మాత్రమే పదవులు అనుభవిస్తున్నారని, ఎంబీసీలు, సంచార జాతుల వారు రాజకీయ అంటరాని వారుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లోని నిరుపేదలకు రాజకీయాల్లో అవకాశం లేకుండా పోతుందన్నారు. అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేలా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే బీసీ వర్గీకరణ చేపట్టాలని కోరారు.