Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరిస్తామనీ, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములమవుతామనీ కేజీ టు పీజీ ప్రయివేటు విద్యాసంస్థల జేఏసీ ప్రకటించింది. మంగళవారం కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ చైర్మెన్ జి రమణారెడ్డి, కందాల పాపిరెడ్డి, ఎస్ఎన్ రెడ్డి (ట్రస్మా), వి నరేందర్రెడ్డి, గౌరి సతీష్, విష్ణువర్ధన్రెడ్డి (టీపీజేఎంఏ), టి విజరుభాస్కర్రెడ్డి (డిగ్రీ కాలేజీల సంఘం) ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రయివేటు విద్యాసంస్థల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు.