Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంధన వనరుల పొదుపు వారోత్సవ సెమినార్లో పలువురు వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంధన వనరులు అత్యంత పొదుపుగా వాడుకోవాలని పలువరు వక్తలు పిలుపునిచ్చారు. ఇంధన వనరుల పొదుపు వారాన్ని పురస్కరించుకుని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ(ఎఫ్టీఏపీసీసీఐ) ఆధ్వర్యంలో ఇంధన వనరుల నిర్వహణ-పరిరక్షణ అంశంపై సెమినార్ను హైదరాబాద్లోని ఫెడరేషన్ హౌజ్లోని సూరనా హాల్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక వనరుల అభివృద్ధి శాఖ కార్పొరేషన్ వీసీ, ఎమ్డీ ఎన్.జానయ్య పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ..ఆయా ప్రభుత్వాలు ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవటంపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. వ్యర్థపదార్ధాల నుంచి ఓఆర్సీ టెక్నాలజీ ద్వారా మళ్లీ ఏవిధంగా ఉత్పత్తులను తయారుచేసే విధానాన్ని వివరించారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంధన పొదుపు ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీఏపీసీసీఐ వైస్చైర్మెన్ రమాకాంత్ లానాని, ఎనర్జీ కమిటీ చైర్మెన్ సురేష్కుమార్ సింఘాల్, కో-చైర్మెన్ విజరుగోపాల్రెడ్డి, ఈఎస్సీఓ ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజరుకుమార్, ఎనర్జీ ఎఫిసియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ టెక్నికల్ మేనేజర్ కె.ఎన్ హేమంత్కుమార్, జాతీయ ఉత్పాదక కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ డి.రజనీ కాంత్, తదితరులు పాల్గొన్నారు.