Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవతా రారు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ నేతలు ఉత్సవాలు చేసు కోవడం కాదు...ఉద్యోగాలు కల్పించాలని టీపీ సీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రారు డిమాండ్ చేశారు. పార్టీ పదవులు పంచుకుంటూ సంబురాలు చేసుకుంటు న్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి ఆలోచిం చడం లేదన్నారు. 2016వ సంవత్సరంలో గురుకుల కోసం పీఈటీ పరీక్ష రాశారని, ఇప్పటివరకు ఉద్యోగులు ఇవ్వలేదని విమర్శించారు. ఈ అంశాన్ని అడిగేందుకు టీపీఎస్సీ కార్యాలమయానికి వస్తే పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 28,000 మంది పీఈటీ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయని, ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా నియమించలేదని చెప్పారు. కొత్త ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గురుకుల పీఈటీ పోస్టులను నియమించాలని డిమాండ్ చేశారు.