Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లిటౌన్
రజాకార్లు, నైజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి తొలి ఎంఎల్ఏ.. జిల్లా పార్లమెంట్ సభ్యుడిగా రెండుసార్లు పనిచేసిన జలగం కొండ లరావు(90) మంగళవారం మృతిచెందారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో అనారోగ్యంతో మృతిచెందినట్టు బంధువులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. కొండలరావు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు స్వయానా సోదరుడు. 1928 డిసెంబర్ 10న పెనుబల్లి మండలం, బయ్యన్నగూడెంలో జన్మించిన ఈయన హైదరాబాద్ నిజాం కాలేజీలో బీఏ పట్టా పొందారు. కృష్ణాజిల్లా, నూజివీడుకు చెందిన ఇందిరాదేవితో ఆయనకు వివాహమైంది.
వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఎమ్మెల్యేగా, రెండుసార్లు పార్లమెంట్ సభ్యునిగా, జెడ్పీ చైర్మె న్గా, బిల్లులు, తీర్మానాల కమిటీ సభ్యుడిగా పనిచేసిన ఆయనకు ఖమ్మం జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిలో పునాదులు వేసిన వారిలో కొండలరావు కూడా ఒక రు. ఆంధ్రప్రదేశ్కు తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో వేంసూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీచేసి 7,737 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977-80, 1980-84లో జిల్లాకు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎనలేని కృషి చేశారు.
సీఎం సంతాపం
మాజీ సీఎం జలగం వెంగళరావు సోదరుడు, మాజీ ఎంపీ జలగం కొండలరావు మరణంపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ఒక ప్రకటనలో ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కొండలరావు ఖమ్మం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొంది ప్రజలకు సేవలందించారని తెలిపారు.