Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చలికి తట్టుకోలేక తొమ్మిది మంది మృతి
- చనిపోయినవారిలో ఏడుగురు వృద్ధులే..
- చలి గాలులకు విలవిల్లాడుతున్న జనం
- పలుచోట్ల మూగజీవాలు మృత్యువాత
నవతెలంగాణ-యంత్రాంగం
పెథాయ్ తుపాన్ తెలంగాణకూ తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. మూడురోజులుగా వీస్తున్న చలిగాలులకు తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది మృతిచెందారు. అందులే ఏడుగురు వృద్ధులే ఉన్నారు. ఈదురుగాలు లకు పిల్లలు గజగజ వణికిపోతుండగా కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. పలుచోట్ల మూగజీవాలూ పదుల సంఖ్యలో మృత్యువాతపడ్డాయి. ఇప్పటికే మార్కెట్లో, కల్లాల్లో ధాన్యం తడిసి లబోదిబోమంటున్న అన్నదాతలు పంటలను కాపాడుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన జన్నారపు నర్సయ్య (65) చలికి తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం పరిస్థితి విషమించి మరణిం చాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి గుడిరేవు గ్రామానికి చెందిన బండారి బూదవ్వ(65) చలికి పలుమార్లు అస్వస్థతకు గురైంది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కుతోడు చలి పెరగడంతో తట్టుకోలేక మరణించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన దాస గంగాధర్ రావు(70), దొంతుల అమృతబాయి (92) చలి తీవ్రతను తట్టుకోలేక మృతిచెందారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న గుర్తు తెలియని యాచకుడు చలికి తట్టుకోలేక ప్రాణాలొదిలాడు. అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం రాత్రి పడుకున్న అతడు ఉదయం విగతజీవిగా మారిపోయాడు. ఎలాంటి ఆధారాలూ లభించకపోవడంతో ఆలయాధికారులు, పోలీసులు దహనసంస్కారాలు నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పంట నష్టం వాటిల్లడమే కాకుం డా సుమారు 10 పశవులు కూడా మృతిచెందాయి. అశ్వా రావుపేటలో మండలంలో 29.5 గరిష్ట ఉష్ణోగ్రత కాగా, 19.05 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఓ అనాథ వృద్ధుడు(70) కన్నుమూశాడు. మండలంలోని నందిపాడు గ్రామానికి చెందిన కూరం నాగేశ్వరరావు, సోడెం సింగ రాజు, కారం ఎర్రయ్యలకు చెందిన పశువులు చలి గాలు లకు మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రా ల్లోనూ ధాన్యం తడిసి ముద్దయింది. సేకరించిన సుమారు 4వేల బస్తాలు వర్షానికి తడిచి నాసిరకంగా మారాయి.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ రూరల్ మండలం గోపాలపురం గ్రామంలో గంటా శ్రీను(50) వ్యక్తి చలితీవ్రత తో మృతి చెందాడు. మృతుని కుటుంబాన్ని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ములకలపల్లి సీతయ్య పరామర్శిం చారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్ప రపల్లిలో కోసని సాయిలు(90) మంగళవారం మృతిచెందా డు. అతని భార్య గతంలో మృతిచెందింది. సోమవారం నుండి ఉష్ణోగ్రతలు పడిపోగా చలికి తట్టుకోలేక తనూ ప్రాణం కోల్పోవడంతో అతని కూతురు అనాథగా మారింది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం మాద్వార్ తండాకు చెందిన కిషన్ నాయక్(57) రోజు మాదిరిగానే పశువులను మేపడానికి తండా శివారుకు వెళ్లాడు. చిరు జల్లులు, చలి తీవ్రతతో వణుకుకు లోనయ్యాడు. ఇంటికి రాగానే అస్వస్ధతకు గురయ్యాడు. కుటుంబీకులు 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతిచెందాడు. అతడికి భార్య మెతీబాయి, ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నిరుపేద కుటుం బాన్ని ప్రభుత్వం అదుకోవాలని తండావాసులు కోరుతు న్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో ఆరు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వాటి విలు వ 40వేల వరకు ఉంటుందని బాధితుడు వాపోయాడు.
తడిసిన ధాన్యం చూసి గుండెపోటుతో రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిరుమలా పురం గ్రామానికి చెందిన రైతు కొత్త వీరభద్రం(60) తడిసిన ధాన్యాన్ని చూసి గుండెపోటుతో కుప్పకూలాడు. తనకున్న ఎకరం వ్యవసాయ భూమిలో రూ.30వేల పెట్టు బడితో వరి సాగు చేశాడు. అకాల వర్షానికి వరి మెదళ్లు తడిసి ముద్దయ్యాయి.
దీన్ని చూసి తట్టుకోలేక సోమవారం ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. మానుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.