Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎల్ఐసి ఎజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసి ఎఓఐ) తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభ హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల ఐదున జరిగింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త కమిటీ ఎన్నిక, పలు తీర్మాణాల అమోదించారు. కొత్త కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా లింగా ప్రభాకర్రావు, ప్రధాన కార్యదర్శిగా కొయ్యడ రామయ్య, ఉపాధ్యక్షులు ఎన్.లింగయ్య, టి.నాగరత్నం, వి.పద్మారెడ్డి, ఎం.వెంకట్రెడ్డి, కార్యదర్శులుగా రామనర్సయ్య, జివిఎస్ఆర్కె చారి, ఎన్.సైదులు, ఎం.రమేష్, కోశాధికారిగా జి.సంగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులుగా కె.ఆంజనేయులు, టి.శ్రీనివాసరావు, ఎస్.లింగయ్య, వి.శ్రీనివాస్, పి.కట్టస్వామి, కె.స్వామి, జె.యాకయ్య, బి.శరత్బాబు, పి.సారయ్య, కె.వేణు, కె.జంగయ్య, వి.రవికుమార్, ఎన్.నర్సింహ్మ, సిహెచ్.సత్యం, పి.వెంకటేశ్వర్లు, యు.శ్రీనాథ్, బి.రామలింగం, ఎ.నర్సింహ్మరావు, ఎస్.అశోక్బాబు, బి.వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ఈసందర్భంగా భీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకించాలి, ఎల్ఐసి ఎజెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించడం, సెప్టెంబరు ఐదున జరగనున్న అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం, గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులకు సంఘీభావం, తెలంగాణ రైతులను ఆదుకుని ఆత్మహత్యలను నివారించడం తదితర తీర్మానాలను మహాసభ అమోదించినట్లు ప్రధాన కార్యదర్శి కొయ్యడ రామయ్య తెలిపారు.