Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే సంపత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో తనపై ఒత్తిడి ఉందని స్పీకర్ మధుసూదనాచారి అంగీకరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ తెలిపారు. ఫార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని తాను స్పీకర్ను కోరినప్పుడు ఒత్తిడి ఉన్న విషయాన్ని తెలిపారని ఆయన వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒత్తిడి కారణంగానే ఫిరాయింపుదారులపై స్పీకర్ చర్య తీసుకోవడం లేదన్నారు. ఫిరాయింపుదారుల అంశంపై స్పీకర్కు నోటీసులు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ కోర్టు నోటీసులను స్పీకర్ కార్యాలయం తిరస్కరించిందని, ఇది సరికాదని అన్నారు. అడ్వకేట్ జనరల్ ధ్వంధ్వ వైఖరి అవలంభిస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టులో ఒక రకంగా మాట్లాడుతూ, స్పీకర్తో మరో రకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారులపై వేటు వేయకుంటే.. అసెంబ్లీ సమావేశాల్లో.. అవిశ్వాస తీర్మానం ప్రవేపెడతారా..? అని విలేకరులు ప్రశ్నించగా అన్ని విషయాలను సీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సంపత్ కుమార్ తెలిపారు.
'మానస పుత్రిక'ను ఎందుకు మారుస్తున్నారు : ఎమ్మెల్యే జీవన్రెడ్డి
కేజీ టూ పీజీపై ప్రభుత్వం మార్పులు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు.