Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల తనిఖీలో బయటపడ్డ రూ.కోటిన్నర
నవతెలంగాణ - సూర్యాపేట టౌన్
నల్గొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో ఆగి ఉన్న కారులోంచి రూ.కోటీ 50 లక్షలు బయట పడ్డ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కర్ణాటక రాష్ట్రానికి చెందిన రిజిస్ట్రేషన్తో ఉన్న ఫోర్ట్ కారును గుర్తు తెలియని వ్యక్తులు హైటెక్ బస్టాండ్లో గురువారం ఉదయం వదిలి వెళ్లారు. అయితే కర్ణాటక రాష్ట్రం ఉబిలీ జిల్లాలోని ఐసిఐసిఐ బ్యాంకు నుండి డబ్బులు తరలిస్తున్నట్లు అక్కడి పోలీసులు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ దుగ్గల్ ఆదేశాల మేరకు పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో కారు ఉందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు కారు డిక్కీని పగులగొట్టి తనిఖీ చేయగా అందులో నుండి రూ.కోటీ 50 లక్షలు బయట పడ్డాయి. అయితే ఈ డబ్బు ఎక్కడిది, ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడి తరలిస్తున్నారనే పూర్తి సమాచారం మాత్రం పోలీసు అధికారులు వెల్లడించలేదు. కారును సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో ఎప్పుడు ఆపారు, ఎందుకు ఆపారో విషయంపై వారు లోతుగా విచారిస్తున్నారు.