Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు పార్లమెంటరీ కమిటీల ఏర్పాటు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీకి సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నది. తాజా నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలకు కమిటీలను ప్రకటిస్తూ ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మెదక్, వరంగల్, నల్లగొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాలకు ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలను నియమించారు. ఇప్పటికే సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఖమ్మం నియోజకవర్గాలకు కమిటీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తున్నది. ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జనసేనపార్టీ పోటీ చేయలేదు. ముందస్తు ఎన్నికలు రావడం, పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరగకపోవడంతో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయామని అప్పట్లో పవన్ కల్యాణ్ ప్రకటించారు.