Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత, ముస్లిం సామాజిక తరగతులపై..
- నిజామాబాద్ జిల్లాలో ఘటన
- పోలీసులకు బాధితుల ఫిర్యాదు
నవతెలంగాణ-కమ్మర్పల్లి
వీడీసీలో చేరనన్నందుకు దళిత, ముస్లిం కుటుంబాలను బహిష్కరించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హసాకొత్తూర్లో ఈ నెల 2న జరగ్గా, బాధితుల ఫిర్యాదుతో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. హసాకొత్తూర్ గ్రామంలో వీడీసీ సభ్యులు మాదిగ సమాజిక తరగతి సంఘ సభ్యుల్ని పిలిపించి కమిటీలో చేరాలని చెప్పారు. మాదిగ సంఘంలో 3 పంతాలు ఉన్నాయనీ, అందులోనూ తమ సంఘంలోని చాలా మంది సభ్యులు ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉంటుంనందున కమిటీలోకి రావడం కుదరదనీ చెప్పారు. అయినా గ్రామాభివృద్ధికి ఆర్థికంగానే కాకుండా అన్ని విషయాల్లో సహకారం అందిస్తామని తెలిపారు. 'గ్రామంలో అన్ని సంఘాలు వచ్చినప్పుడు మాదిగ కులపోడు రాడా'.. అని దూషిస్తూ వీడీసీలోని ఎడ్ల శ్రీకాంత్, ఏనుగు అశోక్తో పాటు ఇతర సభ్యులూ వారిని దుర్భాషలాడారు. వీడీసీలో చేరని 20 మాదిగ సామాజిక తరగతికి చెందిన కుటుంబాలతో పాటు ముస్లిం సంఘంలోని 29 మంది సభ్యులనూ బహిష్కరించారు. గ్రామ కమిటీలోకిరాని మాదిగ, ముస్లిం సంఘాల సభ్యుల పేర్లు లెటర్ప్యాడ్పై రాసి గ్రామంలోని మిగితా అన్ని సంఘాలకు ఇచ్చారు. ఇకపై వారితో గ్రామస్తులకు ఎలాంటి సంబంధాలూ ఉండకూదని ఆ లెటర్లో పేర్కొన్నారు. ఈ నిర్ణ యాన్ని ఉల్లంఘిస్తే జరిమానా వేస్తామని హుకుం జారీచేశారు. బాధిత దళితు లు ఈ విషయాన్ని ఆర్మూర్ ఏసీపీ రాములు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు హసాకొత్తూక్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై ఎస్సీ, ఎస్టి అట్రా సీటితో పాటు పలు సెక్షన్ల కింద కేసు ఎస్ఐ మురళి కేసు నమోదు చేశారు.