Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ బి.వినోద్ కుమార్
నవతెలంగాణ - కలెక్టరేట్
విద్యార్థులు, యువతలో దేశభక్తి పెంపొందించేందుకు అతి పెద్ద జాతీయ జెండా ఏర్పాటు చేశామనీ, ఇది కరీంనగర్కు ఐకాన్గా నిలుస్తుందనీ ఎంపీ బి.వినోద్కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ హైస్కూల్ మైదానంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ జెండాను శుక్రవారం ఎంపీ వినోద్కుమార్ ఆవిష్కరించారు. 150 అడుగుల ఎత్తులో, 32 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పు ఉన్న జాతీయ జెండా రెపరెపలాడింది. అంతకు ముందు ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడారు. వచ్చే 20 ఏండ్లలో మన దేశం ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదుగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గంగు కమలాకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పోలీసు కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి, కరీంనగర్ జాయింట్ కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి, మైనార్టీ సంస్థ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, సుడా చైర్మన్ జి.వి. రాంకిషన్రావు, డిప్యూటీ మేయర్ జి.రమేశ్, నగర పాలక సంస్థ కమిషనర్ కె.సత్యనారాయణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.