Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి పి సరోత్తంరెడ్డి శుక్రవారం రాజీనామా చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని పీఆర్టీయూటీఎస్ కార్యాలయంలో అత్యవసర కార్యనిర్వాహకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు కె జనార్ధన్రెడ్డి, పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు హాజరయ్యారు. అనంతరం సరోత్తంరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పీఆర్టీయూటీఎస్ అధ్యక్షునిగా పనిచేస్తున్న తాను వ్యక్తిగత కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఆ బాధ్యతలను నిర్వహించకలేకపోవడం వల్ల రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఆరేండ్ల నాలుగు నెలలపాటు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించానని పేర్కొన్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పీఆర్టీయూ అధ్యక్షునిగా కమలాకర్రావు?
పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా బీరెల్లి కమలాకర్రావు ఎన్నిక లాంఛనమే కానుంది. కమలాకర్రావు ప్రస్తుతం పీఆర్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంఘంలో క్రియాశీలక బాధ్యతలు నిర్వహించడం, టీఆర్ఎస్ ఎంపీ కవిత బంధువు కావడం, ఎమ్మెల్సీలు కె జనార్ధన్రెడ్డి, పూల రవీందర్లతోపాటు జిల్లాల నాయకులతో సత్సంబంధాలు ఉండడం వల్ల కమలాకర్రావుకే అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశముందని తెలిసింది.