Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నెల 17న తన పుట్టిన రోజు వేడుకలు జరుపు కోరాదని కేసీఆర్ నిర్ణయించారు. తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ నిర్వహించొద్దని ఈ మేరకు సీఎం టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దీంతో హైదరాబాద్లో జలవిహార్లో నిర్వహించాలని భావించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కేసీఆర్ ఆదేశంల వేడుకలను రద్దుచేశారు.
రాష్ట్రపతి శుభాకాంక్షలు
భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలి యజేశారు. ఈ మేరకు ఆయన శుక్ర వారం ముఖ్యమంత్రికి లేఖ పంపారు.