Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీసీ సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందజేసే కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తుదారులు ఏండ్లుగా ఎదురు చూపులు తప్పడం లేదని ఎంబీసీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. బీసీలు, ఎంబీసీలకు రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించిందని, దాంతో లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నా సర్కారు మాత్రం రుణాలు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యాలయాల చుట్టూ లబ్దిదారులను తిప్పుకుంటున్నారే తప్ప రుణాలు విడుదల చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించింది. ఈ మేరకు ఎంబీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య, బీసీ సబ్ప్లాన్ సాధన కమిటీ రాష్ట్ర కార్యదర్శి కిల్లె గోపాల్ శుక్రవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
2017-18 సంవత్సరానికి గాను ఎంబీసీ, బీసీ కార్పొరేషన్ ద్వారా 11 ఫెడరేషన్లకు రుణాలు ఇవ్వడానికి దరఖాస్తులు తీసుకుని లబ్దిదారులను ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఈ రుణాలను మూడు కేటగిరీలుగా విభజించి మొదటి కేటగిరీ కింద రూ.లక్ష, రెండవ కేటగిరీ కింద రూ. లక్ష నుంచి రూ.2లక్షలు, మూడో కేటగిరీ కింద రూ.2లక్షల వరకు రుణాలు అందజేస్తామన్నారు. దీని కోసం లబ్దిదారులను ఎంపిక చేసినా నేటికి రుణాలు విడుదల చేయడం లేదని తెలిపారు. హైదరాబాద్లోని ముషీరాబాద్లో కొంతమంది లబ్దిదారులకు పంపిణీ చేసిన చెక్కుల గడువు దాటడంతో బ్యాంకుల్లో చెల్లలేదన్నారు. లక్షలాది మంది లబ్దిదారులు రుణాల కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే రుణాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.