Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యంగా పని చేయాలి
- పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలో ఉత్తమ్, కుంతియా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో మతాన్ని రెచ్చగొట్టి బీజేపీ లబ్దిపొందాలని ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. ఇప్పటికే దేశంలో మత విద్వేశాలను సృష్టించడం ద్వారా మతాల మధ్య విభజన చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతి పౌరుని హక్కును కాపాడే ప్రయత్నం చేస్తున్నదని, ఈ విషయాలను ప్రజల్లోకి కార్యకర్తలు బలంగా తీసుకెళ్లాలని కోరారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఒక హౌటల్లో పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా సమీక్షలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను ఉత్తమ్ ప్రారంభించారు. సీిఆర్పీిఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిచారు. వీర మరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికలలో నరేంద్రమోడీి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. పెద్ద నోట్ల రద్దు చేసి దేశాన్ని ఆర్థికంగా దివాళా తీశారని, కార్పొరేట్ కంపెనీలకు దాసోహం చేశారని విమర్శించారు. రాబోయే లోక్సభ సాధారణ ఎన్నికలలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు ప్రతి కార్యకర్త పట్టుదలతో పని చేయాలని కోరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా మాట్లాడుతూ ప్రతినియోజకవర్గం నుంచి పది మంది ముఖ్య నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని, కింది స్థాయిలో ఉన్న అంశాలతోపాటు కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించే విషయాలను వివరించాలని సూచించారు. నియోజకవర్గాలలో విభేదాలు లేకుండా అందరూ కలసికట్టుగా పనిచేసేలా చూడాలని సూచించారు. అభ్యర్థులను వెంటనే ప్రకటించడం వల్ల ప్రచారానికి సమయం దొరుకుతుందని, అలాగే ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజలలో మంచి ఆదరణ పొందేలా చూడాలని, రెబల్ అభ్యర్థులు లేకుండా పార్టీ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశానికి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జెట్టి కుసుమకుమార్ అధ్యక్షత వహించగా, ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, కార్యనిర్వహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస కష్ణన్, మధుయాష్కీ, సంపత్కుమార్, చల్లా వంశీచందర్రెడ్డి, వి హనుమంతరావు, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.