Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుక్తాక్షరీ, శషాంక్కు ప్రవీణ్కుమార్ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంతర్జాతీయ కరాటే ఛాంపి యన్షిప్లో బంగా రు, రజత పతకాలు సాధించిన యుక్తాక్షరీ, శషాంక్లకు సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందనలు తెలిపారు. మరిన్ని విజయాలు సాధించాలని కోరుతూ సన్మానించారు. గతవారం వైజాగ్లో జరిగిన మూడో అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్లో ఏడు దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో మన దేశానికి చెందిన విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులైన యుక్తాక్షరీ, శశాంక్ బంగారు, రజత పతకాలు, వెండి పతకాలను సాధించినందుకు పలువురి ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకున్నారు. గతంలోనూ జాతీయ స్థాయిలో మూడుసార్లు బంగారు పతకాలు, అంతర్జాతీయ స్థాయిలో రెండు బంగారు, రజతం సాధించారు. అంతేకాకుండా క్లాసిక్ డ్యాన్స్లో 100కుపైగా నాట్య ప్రదర్శనలు ఇవ్వడంతోపాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు సర్టిఫికెట్ అందుకున్నారు. విశ్వకర్మ లెజెండరీ అవార్డు, నాట్యకళామణి పురస్కారం, కూచిపూడి బాలనర్తకీ అవార్డు, సైన్స్ ఒలంపిక్ యార్డు గోల్డ్మెడల్ అవార్డులు అందుకున్న యుక్తాక్షరీకి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.