Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరీశ్రావుపై జగ్గారెడ్డి ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర మంత్రిననే అహంకారంతోనే హరీశ్రావు ఏకపక్షంగా మంజీర నుంచి శ్రీరాంసాగర్కు నీటిని విడుదల చేశారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. మంజీర నుంచి నీటిని వదిలితే సంగారెడ్డికి నీటి కష్టాలు తప్పవని తాను ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంజీర నీటి విడుదలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇప్పటికైనా స్పందించాలని కోరారు. సింగూరు నీళ్ల కోసం మా ఉద్యమం ఆగదన్నారు. దీన్ని కూడా సీరియస్గా తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ దీక్షలు శాంతియుతంగా కొనసాగిస్తామని చెప్పారు. దీక్షలను అడ్డుకుంటే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందన్నారు. హరీశ్రావు నైతిక బాధ్యత వహించి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.