Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
పై ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థులు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్ జడ్పీహెచ్ఎస్లో విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో నీళ్ల సదుపాయం లేక రోడ్డు దాటి డ్రయినేజీ కాలువలో ఉన్న పైపులైన్ లీక్ నుంచి వచ్చే నీటితో ఇలా ప్లేట్లు శుభ్రం చేసుకుంటూ 'నవతెలంగాణ' కెమెరాకు చిక్కారు. ఏటా వేసవి వచ్చిందంటే మానుకోట జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొంటుంది. అయినా పాలకులు పట్టించుకోవట్లేదనడానికి నిదర్శనమే పై ఫోటో.