Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ లోని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నియామకాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనల ప్రకారం బోర్డు సభ్యుడిగా నియమితులైన నెల రోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సి ఉండగా, సండ్ర ఇప్పటి వరకు ఆ బాధ్యతలు చేపట్టలేదు. దీంతో సండ్ర నియామకాన్ని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర దేవాదాయశాఖ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. గత పాలకమండలిలోనూ తితిదే సభ్యుడిగా సండ్ర వ్యవహరించిన సంగతి తెలిసిందే. 2018 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున సత్తుపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందిన సండ్ర వెంకట వీరయ్య, ఆ పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పిస్తే పార్టీ మారేందుకు సండ్ర సిద్ధమైనట్టు సమాచారం. ఈ కారణంగానే ఆయన ఇంతవరకూ బోర్డు సభ్యుడి బాధ్య తలు స్వీకరించలేదని సమాచారం.