Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జైషేమహ్మద్ ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన సైనికులను స్మరించుకుంటూ బీజేపీ రాష్ట్ర కమిటీ, హిందూవాహిణి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీనుద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదుల దాడిలో 40 మంది జవాన్లు చనిపోవడం బాధాకరమన్నారు. ఉగ్రమూలాలను కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ కూడా సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. దేశం కోసం పోరాడేందుకు ప్రతి పౌరుడూ ముందుకు రావాలన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు హిందూ వాహిణి కార్యకర్తలు పాల్గొన్నారు.