Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో అందుకున్న కమిషనర్ దానకిషోర్
- జీహెచ్ఎంసీకి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్కు మరో అవార్డు దక్కింది. కేంద్ర స్వచ్ఛభారత్ మిషన్ ప్రకటించిన స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ న్యూఢిల్లీలో అందుకున్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర గహ నిర్మాణ, పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా చేతుల మీదుగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ అవార్డును అందుకున్నారు. 10 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరాల్లో కేవలం హైదరాబాద్కు మాత్రమే ఈ పురస్కారం దక్కింది. ఇటీవల నగరానికి ఓడీఎఫ్ను ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా దానకిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. స్వచ్ఛ హైదరాబాద్కు చేస్తున్న కషికి ఈ అవార్డు లభించడం గర్వంగా ఉందన్నారు. పది రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ నగరానికి రెండు గుర్తింపులు లభించడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షన్-2019లోనూ మంచి ర్యాంకింగ్ సాధిస్తామని వెల్లడించారు.