Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రాంచందర్, వీఎస్.రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి ఒక శాతం నిధులు కేటాయించాలని, వేతన ఒప్పందం-2017ను సత్వరమే పూర్తిచేయాలని, ఆర్టీసీకి గూడ్స్, పార్సిల్, కొరియర్ రవాణాను అనుమతించాలని, పాసు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని బడ్జెట్లో పెట్టి ప్రతినెలా చెల్లించాలని, తదితర డిమాండ్లతో రీజనల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రాంచందర్, విఎస్.రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. లఆర్టీసీలోని సమస్యల పరిష్కారం కోసం మూడు దశల్లో పోరాటాలు చేయాలని తమ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని, అందులో భాగంగా ఈ కార్యక్రమం తలపెట్టినట్టు వివరించారు. తక్షణమే గ్రామీణ, నగర సర్వీసులపై పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్పత్రిలో నాణ్యమైన మందులను సరఫరా చేయాలని, తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని కోరారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే చర్యలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీఎఫ్, సీసీఎస్ సంస్థలకు బకాయిపడ్డ మొత్తాలను చెల్లించి కార్మికుల రుణ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. గ్యారేజీ కార్మికులను పనిముట్లను అందజేయాలని, మహిళా కండక్టర్లకు ప్రత్యేక డ్యూటీ చార్ట్లను రూపొందించాలని కోరారు.