Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర మంత్రిమండలి అసమగ్రంగా ఉందని, మహిళలకు, ఎస్టీలకు స్థానం కల్పించకపోవడం బాధాకరమని కేంద్రమాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళ వారం ఆయన మీడియాతో మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘాన్ని బీజేపీ బృందం కలిసిందని, కొన్ని విషయాలను సంఘం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించాలని కోరామన్నారు. హైదరాబాద్ మహానగరానికి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వలసను ఆపేందుకు గ్రామీణాభివృద్ధి పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరామన్నారు.