Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాతాదారులకు సత్కారం
హైదరాబాద్: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 77వ వ్యవస్థాపక దినోత్సవం ఖాతా దారుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సర్కిల్ బ్యాంకు హెడ్ అరుణ కుమార్ అగర్వాల్.. ఖాతాదారులను, ప్రాంతీయ బ్యాంకు రిటైర్డ్ సిబ్బందిని సత్కరించారు. ఖాతా దారుల అభిమానానికి, బ్యాంకింగ్తో వారి అను బంధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య క్రమానికి టైమ్స్ గ్రూపు డైరెక్టర్ మానిక్ దారు వాలా హాజరై అభినందించారు. బ్రాంచి సేవ లను కొనియాడారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది పీసీఏతో వచ్చింది. ఖాతాదారులకు ఉత్తమ సేవలను అందజేశామని వారికి గల బ్యాంకు అవసరాలను తీర్చగలమని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. అనంతరం రెడ్క్రాస్ సంస్థతో కలిసి గోకరాజు గంగరాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సర్కిల్ హెడ్తో పాటు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణలోని 49 బ్రాంచీలన్నీ ఖాతాదారులను సత్కరించి గౌరవించాయి.