Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
నవతెలంగాణ- జోగులాంబ ప్రతినిధి
రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఓ వీఆర్ఓ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా సోమవారం పట్టుబడ్డాడు. అధికారుల వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన రైతు తిక్కయ శెట్టి తన పొలానికి చెందిన పాసు పుస్తకంలో పేరు మార్పిడి చేయాలంటూ వీఆర్ఓ మద్దిలేటిని కోరాడు. రూ. 10వేలు లంచం ఇస్తేనే పనిచేస్తానని అధికారి చెప్పడంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు రైతు నుంచి రూ.10వేలు తీసుకుంటుండగా వీఆర్ఓను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని మద్దిలేటిని అరెస్టు చేశారు.