Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ
- బాధితులకు రూ.70.5 లక్షల చెక్కుల అందజేత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉండడంతో పాటు వారి సంక్షేమానికి భరోసా కల్పించిన ఘనత ప్రభుత్వానిదేనని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ తెలిపారు. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న జర్నలిస్టుల కోసం రూ.వంద కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి 58 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు, 25 మంది తీవ్ర అనారోగ్య/ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులకు 70 లక్షల 50 వేల రూపాయల చెక్కులను చైర్మెన్ అల్లం నారయణ, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, పాలకమండలి సభ్యులు పంపిణి చేశారు. ఈ సందర్బంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, 2017లో ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్బంగా జనహితలో బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారని, జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల మూల నిధిని ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో భాగంగా 34 కోట్ల 50 లక్షల రూపాయలను సంక్షేమ నిధిలో జమ అయ్యాయని గుర్తు చేశారు. మీడియా అకాడమీ ఒకవైపు సంక్షేమం, మరో వైపు శిక్షణ తరగతులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. భవిష్యత్తులో అకాడమీ ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు జర్నలిస్టులకు అందించడానికి పాలకమండలి సభ్యులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు తమ వత్తిలో రాణించడంలో భాగంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపించడం లేదని, కుటుంబానికి పెద్ద దిక్కు మీరేనని గుర్తించి ఆరోగ్యంపై తగు శ్రద్ధ వహించాలని సూచించారు. బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని.. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చేస్తున్న క షిని అభినందించారు. ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, తాను జర్నలిస్టు సమాజం నుంచి వచ్చానని వారి సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని తెలిపారు. చిన్న వయసులోనే పలువురు జర్నలిస్టులు మరణించడం ఆందోళన కలిగిస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి, గౌరీ శంకర్ , కె.శ్రీనివాస్, ఎమ్.నారాయణరెడ్డి, కొమురవెల్లి అంజయ్య, ఓయూ జర్నలిజం శాఖాధిపతి స్టీవెన్ సన్, నాయకులు మారుతీ సాగర్, ఇస్మాయిల్, యోగానంద్, వివిధ జిల్లాల జర్నలిస్టు ప్రతినిధులు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన జర్నలిస్టుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.