Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి నిర్వాసితుల గగ్గోలునష్టపోతున్న
- 312 మంది పట్టాదారులు
- భూమికి భూమి ఇవ్వాలని రైతుల డిమాండ్
యాదాద్రి ఆలయ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తా మంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. నిర్వాసితులకు మాత్రం అరకొర పరిహారం ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో ఎక రానికి రూ.3కోట్లకు పైగా ఉన్న భూములకు రూ.36లక్షలు ప్రకటించడంతో నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. యాదాద్రి దేవస్థానం చుట్టూ 200 అడుగుల వెడ ల్పుతో ఏర్పాటు చేయబోతున్న గిరిప్రదక్షిణ రోడ్డులో 312 మంది రైతుల భూములు పోతున్నాయి. మరో 600 ప్లాట్ల యజమానులూ నష్టపోతున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పైసాపైసా కూడబెట్టుకుని కొన్న ప్లాట్లకు ప్రభుత్వం అతి తక్కువ ధర నిర్ణయించడంతో గుండెలు బాదుకుంటున్నారు.
నవతెలంగాణ- యాదాద్రి భువనగిరి ప్రతినిధి
కృష్ణశిల శిల్పాలతో శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని తలపించే విధంగా రాతి కట్టడాలతో వెయ్యి ఏండ్లు చెక్కు చెదరకుండా ఉండే విధంగా యాదాద్రిని నిర్మిస్తున్నామని సర్కార్ చెబుతున్నది. కానీ భూములు కోల్పోతున్న నిర్వాసితులను నిండా ముంచుతున్నది. ఆలయానికి రూ.640 కోట్లు ఖర్చు చేశామనీ, ఇంకా ఎన్ని నిధులు కావాల్సినా ఇస్తామనీ ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. కానీ, అభివృద్ధి పేరిట సేకరిస్తున్న భూములకు సరైన పరిహారం ఇవ్వడానికి చేతులు ఎందుకు రావడం లేదని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.
200 అడుగుల వెడల్పుతో..
లకీëనర్సింహ్మస్వామి దేవస్థానం చుట్టూ కాలి నడకన ప్రదక్షిణలు చేయడానికి 30 అడుగుల వెడల్పుతో ఉన్న దారి ని విస్తరించాలని వైటీడీఏ అధికారులు ప్రతిపాదించారు. ఆలయ విస్తరణలో భాగంగా మల్లపురం, సైదాపురం, వంగ పల్లి, రాయిగిరి నాలుగు వైపుల ఉన్న రోడ్లను నాలుగు లైన్ల రహదారిగా విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకు న్నారు. ఈ రోడ్లకు దేవస్థానం చుట్టూ 200 అడుగుల వెడ ల్పుతో గిరిప్రదక్షిణ రోడ్డును అనుసంధానం చేస్తూ నిర్మించా లని 2016లో ఆదేశాలు ఇచ్చారు. దీంతో వైటీడీఏ అధికారు లు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు వేయడానికి 93.03 ఎకరాల భూమి సేకరించాలని వైటీడీఏ రెండేండ్ల కిందట రెవెన్యూ శాఖకు నివేదించింది. ఈనెల 3న యాదా ద్రికి వచ్చిన కేసీఆర్ ఈ రోడ్డు పూర్తి చేయడానికి కావాల్సిన భూమిని వైటీడీఏకు అప్పగించాలని కలెక్టర్ను ఆదేశించారు.
93.03 ఎకరాల సేకరణ
యాదగిరిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 73 నుంచి 77వరకు, 82 నుంచి 98 వరకు, 115 నుంచి 118 వరకు, 155లో కలిపి మొత్తం 93.03 ఎకరాలను ఈ రోడ్డు నిర్మాణం కోసం సేకరిస్తున్నారు. ఇందులో 313 మంది పట్టాదారులు, 600 మంది ప్లాట్ ఓనర్లు ఉన్నారు. భూసేకరణకు 2016లో రెవెన్యూ అధికారులు గెజిట్ చేశారు. దీనికి 12-04 2017లో అవార్డు ప్రకటించారు. ఈ భూములకు రిజిస్ట్రేషన్లు చేయొద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈ విషయం తమకు తెలియదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడ్డుకున్న రైతులు..
నాలుగు రోజుల కిందట భూసేకరణ అధికారి, భువ నగిరి ఆర్డీవో భూపాల్రెడ్డి భూముల వద్ద మార్కింగ్ చేయి స్తుండగా నిర్వాసితులు అడ్డుకున్నారు. 'పరిహారం విషయం తేల్చకుండా.. వైటీడీఏ అధికారులకు తమ భూమిని ఎలా అప్పగిస్తామంటూ' నిలదీశారు. రోడ్డు విస్తరణ పనులను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. ఎకరానికి రూ.36లక్షలు, ప్రభుత్వ అనుమతి తీసుకున్న లేఅవుట్లోని ప్లాట్లకు గజానికి రూ.3600, ఇన్లీగల్ వెంచర్ లేఅవుట్ల ప్లాట్ల ధర నిర్ణయిం చి చెప్తామన్న ఆర్డీవో సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమికి భూమి లేదా బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు.
రూ.36లక్షల ధర నిర్ణయించాం
'గిరిప్రదక్షిణ రోడ్డు కోసం 2017లో గెజిట్ చేసి అవార్డు ప్రకటించాం. వైటీడీఏ ఇప్పటి వరకు 2వేల ఎకరాలు సేకరించింది. బాధితులకు ఇస్తున్న పరిహారం ఎక్కువే. ఇప్పటి వరకు ఐదారు నుంచి రూ.14లక్షల వరకు మాత్రమే చెల్లించాం. ఈ భూములు మాత్రం కొండ చుట్టూ ఉండటం వల్ల ఎకరాకు రూ.36లక్షల ధర నిర్ణయించాం. దీనికి మరికొంత పరిహారం కావాలంటే కోర్టుకు వెళ్లే వెసులుబాటు కల్పించాం.'
-భూపాల్రెడ్డి, భువనగిరి ఆర్డీవో
ఎకరానికి రూ.3 కోట్లు ఉంది
సర్వే నెంబర్ 92లో నాకు రెండెకరాల పొలం ఉంది. మా తాత ముత్తాల నుంచి గీ పొలాన్ని నమ్ముకొనే బతుకుతున్నం. ఇప్పుడు రోడ్డు వేయడానికి మా భూములు గుంజుకుంటుండ్రు. గుట్ట అభివృద్ధికి మేము అడ్డం కాదు. ఎకరానికి రూ.3కోట్లు ఉన్న భూమికి రూ.36లక్షలు ఇస్తామనడం ఎక్కడి న్యాయం.'
- రైతు కోల చందు, యాదగిరిగుట్ట
ప్లాట్కు ప్లాట్ ఇచ్చి ఆదుకోవాలి
'సర్వే నెంబర్ 118లో 17 ఏండ్ల కిందట డీటీసీపీ ఆమోదంతో 83 ప్లాట్లతో లేఅవుట్ చేశారు. ఇందులో నా భార్య, కుమార్తె పేరిట ప్లాట్లు కొన్నా. నన్ను చూసి మా సోదరులు, బంధువులు కూడా అప్పుడు గజానికి రూ.5వేల చొప్పున కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్ ధర రూ.20వేలు ఉంది. అధికారులు మాత్రం రూ.3,600 ఇస్తామంటున్నారు. బహిరంగ మార్కెట్లో గజం ధర రూ.20వేలకు ఉంది. అందువల్ల ప్లాటుకు ప్లాటు ఇచ్చి ఆదుకోవాలి.'
-భవాని క్రాంతికుమార్, యాదగిరిగుట్ట