Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిర్మల్
స్కూల్ బస్సు టైర్ల కింద నలిగి చిన్నారి ప్రాణం కోల్పోయింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్లో మంగళవారం సాయంత్రం జరిగింది. చిన్నారి కుటుంబీకులు, స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నర్సరీ చదువుతున్న సోఫీనగర్కు చెందిన సాన్విక(4) అన్నయ్యతో కలిసి పాఠశాలకు వెళ్తోంది. మంగళవారం సాయంత్రం స్కూల్ బస్సులో ఇంటికి వచ్చింది. బస్సు దిగిన తరువాత వెనుక నుంచి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. అది గమనించని డ్రైవర్ నరేష్ బస్సును వెనుకకు నడిపించంతో చిన్నారి టైర్ల కింద నలిగిపోయింది. దీంతో తీవ్ర గాయాలైన సాన్విక అక్కడికక్కడే మృతిచెందింది. ఆగ్రహించిన స్థానికులు స్కూల్ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పట్టణ పోలీసులు కాలనీవాసులతో మాట్లాడి శాంతింపజేశారు. మృతురాలి తండ్రి సంతోశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.