Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో ఐదుగురు
- గద్వాలలో ఇద్దరు
నవతెలంగాణ - విలేకర్లు
హైదరాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా చీటూరుకు చెందిన సోమరాజు(32), వరంగల్కు చెందిన చెందిన నవీన్(50) హైదరాబాద్ తార్నాకలోని విజయపురికాలనీలో ఉంటున్నారు. కూలీ పని చేసేవారు. పనిలో భాగంగా మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో బైక్పై ముషీరాబాద్కు వెళ్తున్నారు. తార్నాకలోని యాక్సిస్ బ్యాంకు వద్ద ముందున్న యూటర్న్ను దాటే క్రమంలో ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వైపు వేగంగా వచ్చిన లారీ వారిని ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలైన సోమరాజును గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు.
ఖైరతాబాద్కు చెందిన నిఖిల్(18), ప్రశాంత్(19) ద్విచక్ర వాహనంపై రెడ్హిల్స్ కాలనీకి వస్తున్నారు. నెక్లెస్ రోడ్డులోని రైల్వేస్టేషన్ సమీపంలో డివైడర్ను ఢ కొట్టారు. ఈ ప్రమాదంలో నిఖిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలైన ప్రశాంత్ను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
యూసుఫ్గూడలోని సాయిబాబా ఆలయ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢకొీని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు.
జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం తూర్పుతండాకు చెందిన రాము నాయక్(29), అమరేష్ నాయక్(33) జమ్ములమ్మ జాతరకు వచ్చి బైక్పై తిరిగి వెళ్తున్నారు. గద్వాల పరిధిలోని గోనుపాడ్లో పార్చర్ల గ్రామ స్టేజీ వద్ద గద్వాల నుంచి రాయచూర్ వెళ్తున్న కర్నాటక బస్సు వెనుక నుంచి వీరి బైక్ను ఢకొీట్టింది.
దీంతో రామునాయక్ అక్కడికక్కడే మతిచెందాడు. అమరేష్ నాయక్ను 108 అంబులెన్స్లో గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గద్వాల పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పరామర్శించారు.