Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పదవి దక్కడంపై భావోద్వేగం
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
మంత్రి పదవి దక్కడంపై ఎర్రబెల్లి దయాకర్రావు భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలందరిని కలుపుకుపోతానని వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీ హయాంలో ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానన్నారని, కానీ అప్పుడు లక్ష్మీపార్వతి వల్ల తనకు పదవి రాలేదని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కేసీఆర్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు.