Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎలిగేడు
రూపాయి కిలో బియ్యం పక్కదారి పట్టి దళారులకు వరంగా మారుతోంది. సోమవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని రాములపల్లి గ్రామపంచాయతీ పరిధిలోనిó గంగిరెద్దుల కాలనీలో 2 వాహనాల్లో తరలిస్తున్న 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రామగుండం టాస్క్పోర్స్, జూలపల్లి పోలీసుల జాయింట్ ఆపరేషన్లో పట్టుకున్నారు. ఎలిగేడు మండలంలో ఇంత పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యం పట్టుబడటం ఇదే మొదటి సారి. దీంతో పెద్దపల్లి ఏసీపీ వెంకటరమణారెడ్డి హుటాహుటీన వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ సీఐ సరీలాల్ మాట్లాడుతూ.. అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఆరుగురు సభ్యులుగల ఈ ముఠాలో ఒక్కరు తప్పించుకున్నారనీ, వీరిపై గతంలో కూడా కేసులు ఉన్నాయని తెలిపారు. వాహనాలను సీజ్ చేసి, నిందితులపై క్రిమినల్ కేసు, పీడీయాక్ట్ నమోదు చేశామని సివిల్ సప్లై అధికారి మల్లారెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో జూలపల్లి ఎస్ఐ లక్ష్మణ్, హెడ్కానిస్టేబుల్ శ్రావణ్, పీసీ అసరొద్దీన్, టాస్క్ఫోర్స్ పోలీసులు, జూలపల్లి పోలీసు సిబ్బంది ఉన్నారు.