Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అభినందనలు తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. రాజ్భవన్లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. టీఆర్ఎస్లో తాను సైనికు డిలాంటి క్రమశిక్షణ గల కార్యకర్తనని, కేసీఆర్ ఆదేశాలను తూచ తప్ప కుండా అమలు చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల ముందు పదుల సంఖ్యలో చెప్పానని గుర్తు చేశారు. మంత్రివర్గంలో చోటు దక్కక పోవడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాల సమీకరణలు దృష్టిలోఉంచుకుని కేసీఆర్ క్యాబినెట్ను ఏర్పా టు చేశారన్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్ర చారా న్ని ఖండిస్తున్నట్టు హరీశ్ చెప్పారు. ఒకవేళఎవరైనా అలాంటి ప్రచా రం కొనసాగిస్తేదాన్ని పట్టించుకోవద్దన్నారు. పార్టీకోసంకేసీఆర్ నాయకత్వం లో అందరూపనిచేయాలని టీఆర్ఎస్నేతలు కార్యకర్తలకు సూచించారు.