Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల్లో ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని దాడి
- కిడ్నాప్కు యత్నం: పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నవతెలంగాణ- జహీరాబాద్
అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి బీజెపీ అభ్యర్థిగా పోటీ చేసిన జంగం గోపి అనుచరుడు ఎన్నికల క్యాంపెయిన్లో ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లించాలని ఒకరిపై దాడి చేశాడు. కిడ్నాప్కు యత్నించగా బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేస్తే గ్రామంలో బసవేశ్వర విగ్రహం ఏర్పాటు చేస్తామని నిరంజన్రెడ్డి ఝరాసంగం మండలం పొట్పల్లి బసవేశ్వరుని సంఘం నాయకులు సంతోష్కు మాటిచ్చాడు. ముందుగా కొంత డబ్బును చెక్కు రూపంలో అందించాడు. అయితే, ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓడిపోవడంతో నిరంజన్రెడ్డి ఇచ్చిన చెక్కును తనకు తిరిగి ఇచ్చేయాలని సంతోష్పై శుక్రవారం రాత్రి 9 గంటలకు దాడి చేశాడు. అనంతరం ఒక హోటల్కు తీసుకెళ్లి అతని వద్దనున్న బంగారం, డబ్బు, మోటార్సైకిల్ లాక్కున్నాడు. అనంతరం అతన్ని జహీరాబాద్ నుంచి ఇస్నాపూర్కు తరలించేందుకు ప్రయత్నించగా బాధితుడు తప్పించుకుని జహీరాబాద్ పోలీస్స్టేషన్కు చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న బీజేపీలోని మరో ఒక గ్రూపు నాయకులు సంతోష్కు మద్దతుగా ధర్నా చేశారు. నిరంజన్రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.