Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 130 మండలాల్లో 20 మీటర్ల కన్నా దిగువకు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో భూగర్భ జలం మరింత లోతుకు పోయింది. 130 మండలాల్లో 20 అడుగుల కన్నా దిగువన ఉన్నట్టు నమోదయింది. గత సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే రాష్ట్ర స్తాయిలో సగటున 1.56 మీటర్లు తక్కువగా భూగర్భ జలమట్టం నమోదయింది. 13 జిల్లాల్లో సగటు కన్నా తక్కువగానూ, 18 జిల్లాల్లో సగటు కన్నా ఎక్కువగానూ భూగర్భ జలాలు ఉన్నట్టు భూగర్భ జల శాఖ తాజా నివేదికలో పేర్కొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 1219 గేజింగ్ కేంద్రాల్లో భూగర్భ జల సమాచారాన్ని ఆ శాఖ సేకరించింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో రాష్ట్రంలో సగటు వర్షపాతం 16.1 శాతం తక్కువగా నమోదు కావటంతో ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో 287 మండలాల్లో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదయింది. రాష్ట్రంలో గత సంవత్సరం ఫిబ్రవరిలో భూగర్భ జల మట్టం సగటున 10.97 మీటర్లు కాగా 2019 ఫిబ్రవరిలో 12.53 మీటర్లుగా నమోదయింది. నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండలంలో భూగర్భ జలమట్టం 66.94 మీటర్ల లోతులో ఉండగా మేడ్చల్ జిల్లాలో 31.40 మీటర్ల లోతులో ఉన్నది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జనగాం, మహబూబ్నగర్, సిద్దిపేట జిల్లాల్లో భూగర్భ జలమట్టం తగ్గిపోగా నాగర్కర్నూల్, నిజామాబాద్, హైదరాబాద్, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది.