Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి పీయూష్గోయల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశ రక్షణ విషయంలో, అవినీతి నిర్మూలన విషయంలో వెనక్కి తగ్గబోమని, దేశానికి కాపలా దారులుగా ఉంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. హైదరాబాద్లోని హౌటల్ కత్రీయలో మే బీ చౌకీదార్ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. అనంతరం హౌటల్ తాజ్కృష్ణలో మహిళా పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 130 కోట్ల భారతీయులలో దేశం కోసం పనిచేసే ప్రతిఒక్కరూ చౌకిదారే అన్నారు. మోడీ మళ్లీ అధికారంలోకి రావ డం ఇష్టం లేక అవినీతి పరులు ముఠా కట్టారని ఆరోపించారు. 2008లో టెర్రరిస్టులు ముంబయిని ఎటాక్ చేసినప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిం చారు. దేశ రక్షణ విషయంలో వెనక్కి తగ్గబోమని, తాము నిజమైన చాకీదార్లమని అన్నారు. ప్రతి ప్రభు త్వం కాపలాదారు మీడియానే అన్నారు. ఈ ఐదేం డ్లలో మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ప్రభుత్వం తనవంతు సహాయం చేసిందన్నారు. తమ ప్రభు త్వం తీసుకొచ్చిన ప్రతి పథకం ఊహకందనిదని, భవిష్యత్లో మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. దేశంలో చీకట్లో మగ్గుతున్న 18,452 గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించే క్రమంలో ఇంజినీర్లను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని, అవరోధాలను దాటుకుని ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పిం చామని అన్నారు. రైళ్లల్లో మంచి ఆహారం అందిం చేందుకు ఐఆర్సీటీసీ క్యాంటిన్లలో సీసీ కెమె రాలను పెట్టామన్నారు. దేశంలో ఇప్పటి వరకు 140 కోట్ల ఎల్ఈడి బల్బులు వినియోగంలోకి వచ్చాయన్నారు. దీనితో విద్యుత్ వినియోగం తగ్గి 15 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఏడాదికి మిగులుతున్నాయన్నారు. మహిళల భాగస్వామ్యం తోనే ఆరోగ్య భారత్ సాధ్యం అవుతుందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ..మోడీ కన్నా కేసీఆర్ పెద్ద హిందువునో కాదో కానీ, ఓవైసీ కన్నా పెద్ద ముస్లిం అని విమర్శించారు. కేసీఆర్ది ఫెడరల్ ఫ్రంట్ కాదని, ఫ్యామిలీ ఫ్రంట్ అని అన్నారు. కాంగ్రెస్కు చెందిన ప్రధానులు నెహ్రు నుంచి మన్మోహన్ సింగ్ వరకు ప్రతి ఒక్కరి హయాంలోనూ అవినీతి జరిగిందని, దేశానికి చౌకీ దారుగా ఉండటంతో ఐదేండ్ల మోడీ పాలనలో అవినీతి జరగలేదని అన్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి మాట్లాడుతూ...మిగతా పార్టీల మాదిరిగా బీజేపీ కుటుంబ పార్టీకాదని అన్నారు. లక్ష్మణ్, దత్తాత్రేయ, తన కుటుంబాల నుంచి రాజకీ య వారసులు లేరన్నారు. మిగతా పార్టీలో తమ నాన్న, బంధువు ఎప్పుడు చనిపోతారా? సీఎం పీఠం ఎప్పుడు ఎక్కుదామా? అన్న యావలోనే వారసులు ఉంటారని విమర్శించారు. ప్రధాని మోడీ దేశానికి చౌకీదారుగా ఉండబట్టే ఐదేండల్లో ఒక్క బాంబు పేలుడుగానీ, మత కలహాలు గానీ జరగలేదని అన్నారు. మోడీ వచ్చాక లబ్దిదారుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు వేస్తుండటంతో అవినీతికి ఆస్కారం లేకుండా పోయిందన్నారు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్న తనను ఆదరించాలని కోరారు. సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ...దేశ వ్యాప్తంగా బీజేపీకి 300లకుపైగా ఎంపీ సీట్లు వస్తాయని, తెలంగాణ లో టీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.