Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదుకోవాలని రైతుల ఆందోళన
నవతెలంగాన-గంగాధర
వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పోతుగంటిపల్లి రైతులు ఆందోళన చేశారు. మండల కేంద్రంలోని కరీంనగర్ - జగిత్యాల ప్రధాన రహదారిపై శనివారం బైటాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పొట్టదశకు వచ్చిన పైర్లు వడగండ్ల వానకు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు తీరని నష్టం వాటిల్లిందని తెలిపారు. వడగండ్లు కురిసి మూడు రోజులవుతున్నా.. తమను పట్టించుకున్న వారే కరువయ్యారని వాపోయారు. కనీసం సంబంధిత అధికారులు తమ పొలాలను చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.