Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోదఫా ఎన్నికల ప్రచారాన్ని ఈనెల 29 నుంచి ప్రారంభించనున్నారు. ఏప్రిల్ నాలుగో తేదీ వరకూ ఆయన ప్రచారం కొనసాగనుంది. మధ్యలో ఏప్రిల్ 30న ప్రచారం ఉండదు. మొత్తం ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో షెడ్యూల్లో ప్రకటించిన మొదటి నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటలకు, రెండో నియోజకవర్గంలో 5.30 గంటలకు ఆయన సభలు ప్రారంభమవుతాయి. అయితే టీఆర్ఎస్ అధికారికంగా విడుదల చేసిన ప్రచార సభల జాబితాలో ఆదిలాబాద్ నియోజకవర్గ పేరు లేకపోవటం గమనార్హం. తొలి విడతలో కేసీఆర్ కరీంనగర్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. ఇవిపోను మిగతా 13 నియోజకవర్గాల్లో రెండో దఫాలో సీఎం సభలు జరగనున్నాయి. హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎంకు వదిలేసి, డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారు కాబట్టి అక్కడ కేసీఆర్ ప్రచారం చేయబోరు. ఇక మిగిలిన ఒకే ఒక్క స్థానం ఆదిలాబాద్. ఆ స్థానానికి సంబంధించి ప్రచార షెడ్యూల్ విడుదల చేయలేదు.
పర్యటన వివరాలు...
తేదీ పార్లమెంటు నియోజకవర్గం వేదిక
1) మార్చి 29 నల్లగొండ మిర్యాలగూడ మల్కాజ్గిరి, చేవెళ్ల,
సికింద్రాబాద్ ఎల్బీ స్టేడియం
2) మార్చి 31 నాగర్ కర్నూల్ వనపర్తి మహబూబ్నగర్
3) ఏప్రిల్ 1 పెద్దపల్లి రామగుండం
4) ఏప్రిల్ 2 వరంగల్ వరంగల్ భువనగిరి
5) ఏప్రిల్ 3 జహీరాబాద్ ఆంథోల్ మెదక్ నర్సాపూర్
6) ఏప్రిల్ 4 మహబూబాబాద్ మహబూబాబాద్ ఖమ్మం ఖమ్మం