Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎన్ రాధా కృష్ణన్ బదిలీ అయ్యారు. కోల్కతా హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ న్యాయశాఖ జాయింట్ సెక్రెటరీ రాజేం దర్ కశ్యప్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిని, రాష్ట్రపతిని సంప్రదిం చిన తర్వాత కేంద్ర న్యాయ శాఖ బదిలీ నోటిఫి కేషన్ను విడుదల చేసింది. ఏప్రిల్ 6వ తేదీ నాటికి కోల్కతా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాలని నోటిఫి కేషన్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి ఒకటిన ఉమ్మడి హైకోర్టు విభజించబడిన విషయం తెలిసిందే. దీంతో తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు వేర్వేరుగా ఏర్పడ్డాయి. ఈ ఏడాది జనవరి ఒకటిన తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా టిబిఎన్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఏడాది జనవరి 10న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ రాధాకృష్ణన్ను బదిలీ చేయాలని నిర్ణయించింది. గతే డాది డిసెంబర్ 31న కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డికె గుప్తా పదవీ విరమణ చేశారు. ఖాళీ అయిన ఆ పోస్టులోకి జస్టిస్ రాధాకృష్ణన్ను నియమిం చాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనిని తిరిగి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. అన్ని కోణాల్లోనూ పరిశీలి ంచిన తర్వాతే కొలీజియం జస్టిస్ రాధాకృష్ణన్ను బదిలీ చేయాలని నిర్ణయించిందని, పరిపాలనా పరంగా ఉన్న అవసరాల దృష్ట్యా బదిలీ చేస్తు న్నామని సుప్రీంకోర్టు తిరిగి కేంద్ర ప్రభుత్వా నికి నివేదించింది. దాంతో తాజాగా జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీకి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్ 1959 ఏప్రిల్ 29న కేరళలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ న్యాయవాదులు. బెంగళూరులో ఎల్ఎల్బీ పూర్తి చేశాక 1983 డిసెంబర్ 11న తిరువునంతపురంలో న్యాయ వాదిగా ఎన్రోల్ అయ్యారు. కేరళ హైకోర్టుకు 1988లో తన ప్రాక్టీస్ మార్చారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా 2004 అక్టోబర్లో నియమితులయ్యారు. అదే హైకోర్టుకు రెండు సార్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. చత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2017లో నియమితుల య్యారు. ఆ తర్వాత బదిలీపై 2018 జూలై 7న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులు ఏర్పాటు కావడంతో జస్టిస్ రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది జనవరి 1వ తేదీన తిరిగి ప్రమాణస్వీకారం చేశారు. మూడు నెలల కాలం పూర్తి కాకుండానే ఆయన బదిలీ అయ్యారు.