Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ ఫిరాయింపులపై దేశ వ్యాప్త ఉద్యమం : కాంగ్రెస్పార్టీ రౌండ్టేబుల్లో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అవినీతి సొమ్ములతో సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొంటున్నారని వక్తలు విమర్శించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలన్న కుట్రతోనే కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టాలన్నారు. శనివారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో కాంగ్రెస్పార్టీ శాసనసభాపక్షం ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నేతలు, ప్రజాసంఘాల బాధ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామానికి పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ వీరతెలంగాణను అప్రజాస్వామ్య తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ ఓటును టీఆర్ఎస్ అభ్యర్థికి వేయనందుకు తమకున్న ఏకైక ఎమ్మెల్యేను కూడా చేర్చుకున్నారని చెప్పారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్టు ఎమ్మెల్యేలు చెబుతున్నారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉంటే అభివద్ధి చేయరా? అని ప్రశ్నించారు. టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ మాట్లాడుతూ టీఆర్ఎస్లో ఉన్న అంతర్గత సంక్షోభం బయటపడకుండా ఉండేందుకు మిగతా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించుకుంటున్నారని ఆరోపించారు. టీమాస్ చైర్మెన్, ప్రోఫెసర్ కంచ ఐలయ్య ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం కేసీఆర్ ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు బీసీలు ఆత్మగౌరవ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జెట్టి కుసుమకుమార్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, గద్దర్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ఊచలు లెక్కపెట్టకతప్పదు : కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, దానిపై కాంగ్రెస్పార్టీ లోక్పాల్లో ఫిర్యాదుచేయనుందని కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ చెప్పారు. కేసీఆర్ జైల్లో ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు. ప్రలోభాలకు గురి చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం లోక్పాల్ పరిధిలోకి వస్తుందన్నారు. లోక్పాల్ వచ్చిన తర్వాత కేసీఆర్పై తొలికేసు నమోదు అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణ తీసుకొస్తామన్నారు. శనివారం గాంధీభవన్లో కుంతియా, టీపీసీసీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్అలీ, ఎమ్మెల్యే సురేందర్, గూడూరు నారాయణరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.