Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
షహీద్ భగత్సింగ్ స్ఫూర్తితో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుదామని అఖిల బారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. భగత్సింగ్ 88వ వర్ధంతి సభను శనివారం తెలం గాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12500 రైతు ఆత్మహ త్యలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కనీసం నివారణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఎమ్మెస్ స్వామి నాథన్ కమిటీ సిఫారస్సులు అమలు చేయాలని, కేరళ ప్రభుత్వం తరహాలో రుణ విమోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలం గాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్ మాట్లాడుతూ బీమా పథకం పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీలకు దోచిపెడుతు న్నాయని ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలోనే ఎకరానికి రూ. 6వేల అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభు త్వాన్ని గద్దెదించే వరకు రైతు సంఘాలు పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వి. సంజీవరెడ్డి, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.