Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మద్దతు తీసుకోవాలని కాంగ్రెస్ ఆరాట పడుతున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులే తమ కొంప ముంచాయని రాహుల్ గాంధీకి చెప్పిన టీపీసీసీ నేతలు ఒంటరి పోరాటానికి ఆయనను ఒప్పించగలి గారు. అన్ని లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్ధుల ను కూడా ఆ పార్టీ ముందుగానే ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిగా బరిలోకి దిగిన నాలుగు పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఒంటరి పోరుకు సిద్ధం కావటంతో మిగిలిన భాగస్వామ్య పార్టీలకు మింగుడు పడలేదు. ఈ నేపధ్యంలో ఎవరి కి వారే విడిగా పోటీచేయాలని నిర్ణయించారు. సీపీఐ, సీపీఐ (ఎం) మధ్య పొత్తులు కూడా కుదిరా యి. చెరి రెండు స్థానాల్లో ఆ పార్టీలు పోటీ చేస్తున్నా యి. మిగిలిన స్థానాల్లో తమకు మద్దతునివ్వమని కాంగ్రెస్ నేతలు సీపీఐ నేతలను కోరారు. సీపీఐ నేతలు ఇప్పటి వరకూ ఎటువంటి హామీ ఇవ్వలేదు. కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్ మూడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ అభ్యర్ధుల కొరత ఆ పార్టీని వేధిస్తున్నది. రాష్ట్రంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో కూడా తేల్చుకోలేక పోతున్నది. ఐదు స్థానాల్లో పోటీ చేస్తా మని ప్రకటించినా పార్టీ అధ్యక్షుడి నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం రాక పోవటంతో నేతలు ఆయోమయంలో పడిపోయారు. సికిందరా బాద్, ఖమ్మం స్థానాల నుంచి పోటీ చేయటానికి అభ్యర్ధులు ముందుకు వచ్చినా ఇంకా పార్టీ అధ్యక్షుడి అనుమతి లభించలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం నేతలతో చర్చలు జరపటం విశేషం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఆర్సీ కుంతియా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతో చర్చలు జరుపుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై శనివారం జరిగిన సదస్సులో కలిసిన వివిధ పార్టీల నేతల మధ్య పొత్తులపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. టీడీపీ పోటీ చేసే స్థానాల్లో స్నేహ పూర్వక పోటీ ఉన్నప్పటికీ మిగిలిన స్థానాల్లో తమ అభ్యర్ధులకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ఈ ప్రతిపాదనపై కూడా చంద్రబాబు నిర్ణయం కోసం తెలుగుదేశం నేతలు ఎదురు చూస్తున్నారు. తమ వల్ల నష్టం జరిగిందని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మళ్లీ తమ మద్దతు కోరటం పట్ల కొందరు తెలుగుదేశం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంబిస్తే పార్టీ శ్రేణులు పూర్తిగా ఇతర పార్టీల్లోకి వెళ్లి పోతారని మరికొందరు నేతలు వాదిస్తున్నారు.
రేవంత్ దారిలో....
మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన రేవంత్రెడ్డి వ్యక్తిగత హౌదాలో ఇతర పార్టీల నేతలను కలిసి మద్దతు కోరటం చర్చనీయాంశమైంది. టీడీపీ నేత దేవేందర్గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ప్రజా గాయకుడు గద్దర్ను కలిగి తనకు మద్దతునివ్వాల్సిందిగా రేవంత్ కోరారు. దీనితో టీపీసీసీ నేతల్లో కూడా చలనం కలిగింది. వారు కూడా ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.