Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మత రాజకీయాలను బొందపెట్టడమే భగత్సింగ్కు నిజమైన నివాళి అని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు ఎ విజరుకుమార్, కోట రమేష్ అన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేసే వారిని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 88వ వర్ధంతి సందర్బంగా వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా విజరుకుమార్, కోట రమేష్ మాట్లాడుతూ భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు చిరు ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలర్పించారని చెప్పారు. దేశం కోసం, ప్రజల కోసం భవిష్యత్ తరాల కోసం ఉరికంబమెక్కారని అన్నారు. వారి త్యాగాల పునాదుల మీద స్వాతంత్య్రం సిద్ధిస్తే గద్దెనెక్కిన పాలకులు వారి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. వారి త్యాగాలను పరిహసించేలాగా ఇష్టారాజ్యంగా దేశ స్వాతంత్య్ర పోరాట విలువలను తుంగలో తొక్కుతున్నారని అన్నారు. మతోన్మాదాన్ని భగత్ సింగ్ వ్యతిరేకించారని చెప్పారు. మతం ప్రజలను మత్తులో ముంచుతుందని దానిపట్ల జాగరూకతతో ఉండాలని యువతను, ప్రజలను హెచ్చరించారని అన్నారు. మతం సాటిమనిషిని చంపేలా చేస్తున్నదని, మత రహిత రాజ్యంగా ఉండాలని ఆకాంక్షించారని గుర్తు చేశారు. కుల, మత కొట్లాటలు దేశాన్ని దిగజారుస్తాయని వారు అంటే నేటి పాలకులు కుల, మత దాడులతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. లౌకిక రాజ్యం దేశానికి రక్షా అని కోరుకుంటే నేటి పాలకులు మత రాజ్యంగా మార్చాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. అందుకే భగత్సింగ్ స్ఫూర్తితో మతోన్మాద శక్తులపై యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి పగడాల లక్ష్మయ్య, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం విప్లవ్ కుమార్, నగర కార్యదర్శి టి మహేందర్, యువతుల కన్వీనర్ సుధా, కెేవీపీఎస్ నగర నాయకులు కె విజరు తదితరులు పాల్గొన్నారు.