Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యా కమిషనర్కు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు బాండ్ లేకుండా ఆటో రెన్యువల్ చేయాలని ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ ఎ అశోక్ను శనివారం హైదరాబాద్లో సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ కెపి శోభన్బాబు నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫిబ్రవరి, మార్చి వేతనాల ప్రొసీడింగ్స్ విడుదల చేయాలని కోరారు. మార్చి 29 తర్వాత బాండ్ లేకుండా ఆటోమేటిక్గా రెన్యువల్ అయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. స్పాట్ రెమ్యూనరేషన్ 50 శాతం పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై ఇంటర్ విద్యా కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.