Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించి చంపుకో వద్దని తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ విజ్ఞప్తి చేసింది. శనివారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం వద్ద కమిటీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) ఉపాధ్యక్షులు అందీష్ మాట్లాడుతూ ర్యాంకుల పేరుతో పిల్లలపై ఒత్తిడి పెంచి ఆత్మహత్యలు చేసుకునేలా చేయొద్దని కోరారు. కార్పొరేట్ కాలేజీలు విద్యావ్యా పారం కోసమే నడుస్తున్నాయని విమర్శించారు. ఆ కాలేజీల పేరు కోసం విద్యార్థులకు ర్యాంకులు వచ్చేలా మనోవేదనకు గురిచేస్తున్నాయని చెప్పారు. ఆ ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. పిల్లల చావులకు కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలేనని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కాలేజీ యాజమాన్యాలపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ కాలేజీలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీకేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించాలని సూచించారు. భవిష్యత్తులో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా కన్వీనర్ గోపి, పీడీఎస్యూ నాయకులు రియాజ్, కె గణేష్, మహేష్, ధన్రాజ్ తదితరులు పాల్గొన్నారు.